ప్రముఖ సౌత్ ఇండియన్ సింగర్ ఎస్. జానకి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రస్తుతం మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఎస్. జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆమె మనవడు చనిపోవడంతో సింగర్ జానకి మానసిక వేదనకు గురైనట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
1938లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన ఆమె పూర్తి పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. ఆమెను జానకమ్మ, గాన కోకిల అనే పేర్లతోపాటు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. 1957 నుంచి 2019 వరకు తన పాటలతో ఆమె సినీ పరిశ్రమకు సేవలు అందించారు. తెలుగువారైన ఆమె తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం పాటలు పాడారు. ఎస్. జానకి తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించారు. ముఖ్యంగా 12 నంది అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు.
ఇక జానకి 2020లో కూడా మరణించినట్లు అప్పట్లో ప్రచారం జరగడంతో, “ఆమె తాను అప్పుడు బానే ఉన్నానని, ఇప్పటికే తనను ఆరుసార్లు చంపేశారు” అంటూ అప్పట్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా శ్రోతలకు దూరమవ్వడం బాధాకరం.

