Sumalatha: చరిత్ర సృష్టించిన జానీ మాస్టర్ భార్య: TFTDDA అధ్యక్షురాలిగా బాధ్యతల స్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి శ్రీమతి వి.వి. సుమలతా దేవి అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ వేడుకకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read:SS Thaman: అఖండ తాండవం కోసం టెక్నాలజీని నమ్మలేదు.. శివాలజీని నమ్మం
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ప్రమాణ స్వీకారోత్సవంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. సభ్యుల సంక్షేమం కోసం తమకున్న భారీ ప్రణాళికలను ఆయన వెల్లడించారు: యూనియన్లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భీమా ఉండాలన్న లక్ష్యంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని సంప్రదించగా, ఆయన వెంటనే ఆర్థిక సాయం అందించారని తెలిపారు. ఒక సభ్యుడు యూనియన్ నుండి రిటైర్ అయ్యేటప్పుడు సుమారు ₹10 నుండి ₹15 లక్షల వరకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్యాన్సర్లకు సొంత స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చిన శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, మహిళా నాయకత్వంలో యూనియన్ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్యాన్సర్ల కష్టసుఖాల్లో తన కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
శ్రీశైలం యాదవ్ మరియు సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. యూనియన్లో ఉండే చిన్న చిన్న సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని, కోర్టులు, కేసుల చుట్టూ తిరిగి ఇండస్ట్రీ పరువు తీయవద్దని హితవు పలికారు. సుమలత విజయం ఇండస్ట్రీలోని మహిళా కళాకారులకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
సుమలతా దేవితో పాటు పలువురు సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు, కోశాధికారి: పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులు: కె. సురేష్, యమ్. రాజు, కమిటీ సభ్యులు: కె. సతీష్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని తదితర సినీ ప్రముఖులు పాల్గొని నూతన బాడీకి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ సుమలతా దేవి ధన్యవాదాలు తెలుపుతూ, సమస్యల పరిష్కారమే తన ప్రధమ కర్తవ్యమని ప్రకటించారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!