అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాగా జాన్వీ ఇటీవలే మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. రంగురంగుల బికినీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఫోటోషూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతమైన సిటీ వెలుతురులను సూర్యాస్తమయంలో తన ఇంటి బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తోంది. సమ్మర్ సైతం ముగియడంతో జాన్వీ బీచ్ లకు కాస్త విరామం ఇవ్వనుంది. ప్రస్తుతం జాన్వీ ‘దోస్తానా 2’ ‘తఖ్త్’ సినిమాలో నటిస్తోంది.