Chhaava: రిలీజ్ కు ముందు వివాదం.. అయినా భారీ క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఛావా. తొలుత హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమాని తెలుగులో తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ చేస్తుందంటేనే సినిమా మీద మామూలుగానే అంచనాలు ఉంటాయి. దానికి తోడు భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కావడంతో దీన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
Venkatesh: 303 కోట్ల రీజనల్ బ్లాక్ బస్టర్..20 కథలు కాదని డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్?
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తెలుగు రాష్ట్రాలలో దాదాపు 550 కి పైగా స్క్రీన్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మేడాక్ ఫిలిమ్స్ బ్యానర్ మీద దినేష్ విజన్ నిర్మించారు. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా రష్మిక మందన ఏశుభాయిగా నటించిన ఈ చిత్రం హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టి దాదాపు 500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని గీతా కాంపౌండ్ నమ్ముతుంది. తెలుగు ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి తెలుగు వెర్షన్ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం