Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Erra Mallelu Completes 40 Years

‘కళ శ్రమైక సహజీవనం కోసం’ అని చాటిన ‘ఎర్ర మల్లెలు’

Published Date :May 1, 2021 , 5:28 am
By Prakash
‘కళ శ్రమైక సహజీవనం కోసం’ అని చాటిన ‘ఎర్ర మల్లెలు’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

(మే 1న ‘ఎర్రమల్లెలు’కు 40 ఏళ్లు)
తొలి నుంచీ అభ్యుదయ భావాలు కలిగి, వామపక్ష ఆదర్శాల నీడన మసలారు నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో తెరపై కనిపించిన మాదాల రంగారావు తరువాత మిత్రులతో కలసి నవతరం పిక్చర్స్ నెలకొల్పారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు టి.కృష్ణ వంటివారు ఈ ‘నవతరం’ నీడలో నిలచిన వారే. తొలి ప్రయత్నంగా మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం మంచి విజయం సాధించింది. పెట్టుబడికి తగిన లాభాలను చూపింది ఆ సినిమా. దాంతో తన వామపక్ష భావాలను మరోమారు పలికిస్తూ మాదాల రంగారావు నిర్మించిన చిత్రం ‘ఎర్రమల్లెలు’. ‘యువతరం కదిలింది’కి దర్శకత్వం వహించిన ధవళ సత్యం ‘ఎర్రమల్లెలు’ కూడా రూపొందించారు. 1981 మే 1న విడుదలైన ‘ఎర్రమల్లెలు’ మరోమారు మాదాలకు విజయాన్ని చవిచూపింది.

ఓ పల్లె, దానికి ఆనుకుని ఉన్న ఓ పట్టణం. ఈ రెండింటిలోనూ కరణం, మునసబు, కామందులు, పరిశ్రమల యజమానులు జనం రక్తం జలగల్లా పీల్చేవారు. పల్లెలో కరణం, మునసబు, కామందు ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాక్టరీ యజమాని పనిగంటలు పెంచి, వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడు. ఎదురు తిరిగిన రంగాను జైలుకు పంపిస్తారు. ప్రశ్నించిన సూరిబాబును పనిలోంచి తొలగిస్తారు. పల్లెకు వచ్చిన పంతులు ప్రజల్లో చైతన్యం రగిలిస్తాడు. ఇక సూరిబాబు న్యాయపోరాటంలో గెలుస్తాడు. పంతులును చంపాలనుకుంటారు. ఊరి జనం తిరగబడతారు. సూరిబాబును చంపిస్తారు. చివరకు జనం అంతా ఒక్కటై రంగా నాయకత్వంలో దుర్మార్గులందరినీ బుగ్గి చేయడంతో కథ ముగుస్తుంది.

Also Read

  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
Add as a preferred
source on google

‘ఎర్రమల్లెలు’ చిత్రంలో మురళీమోహన్, గిరిబాబు, మాదాల రంగారావు, రంగనాథ్, పి.ఎల్.నారాయణ, సాక్షి రంగారావు, పి.జె.శర్మ, సాయిచంద్, చలపతిరావు, నర్రా వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, వై.విజయ, కృష్ణవేణి, లక్ష్మీచిత్ర నటించారు. తరువాతి రోజుల్లో ‘ప్రతిఘటన’ వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు టి.కృష్ణ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. లాయర్ గా ఓ సన్నివేశంలో పోకూరి బాబూరావు కనిపించారు. మాదాల రంగారావు తనయుడు మాదాల రవి బాలనటునిగా నటించాడు. అతనిపై చిత్రీకరించిన “నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో…” అన్న పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ పాటతో పాటు “నేడే మేడే మేడే…” , “బంగారు మాతల్లీ భూమీ మా లచ్చిమీ..”, “ఏయ్ లగిజిగి లంబాడీ… తిరగబడర అన్నా…” అని సాగే పాటలు కూడా ఆదరణ పొందాయి.

మాదాల రంగారావు కథ అందించిన ఈ చిత్రానికి యమ్.జి. రామారావు మాటలు రాశారు. పాటలు సి.నారాయణరెడ్డి, కొండవీటి వెంకటకవి, అదృష్టదీపక్, ప్రభు, ధవళ సత్యం రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. గౌరవ నిర్మాత అంటూ మాదాల కోదండరామయ్య పేరు ప్రకటించారు. కె.రాధాకృష్ణ నిర్వహణ బాధ్యతలు చూశారు.

మాదాల రంగారావు నిర్మాణసారథ్యంలో అంతకుముందు రూపొందిన ‘యువతరం కదిలింది’లో నటించిన కొందరు ఈ చిత్రంలోనూ కనిపిస్తారు. ‘యువతరం కదిలింది’ కంటే మిన్నగా ‘ఎర్రమల్లెలు’ విజయం సాధించింది. మాదాల రంగారావు చూపిన మార్గంలోనే ఆ తరువాత ఎందరో విప్లవనేపథ్యమున్న చిత్రాలను రూపొందించారు. ఆ చిత్రాలను చూసినప్పుడు సైతం మాదాల రంగారావు మన స్మృతిపథంలో మెదలక మానరు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Erra Mallelu
  • Madala Rangarao

తాజావార్తలు

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు

  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!

  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions