మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ఆ మధ్య వార్తలు వెలువడగా ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మైత్రి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడంతో ఈ సినిమా బాధ్యతలను మరొక నిర్మాత అందుకున్నట్లు సమాచారం. దిల్ రాజు నేతృత్వంలోని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ నుంచి అప్పట్లో విడిపోయిన లక్ష్మణ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ నిర్మాణ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రవితేజ ఇమేజ్కు తగ్గట్లుగా ఒక పవర్ఫుల్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథను రూపుదిద్దినట్లు సమాచారం. వివేక్ స్టైలిష్ టేకింగ్ కు రవితేజ మాస్ ఇమేజ్ తోడైతే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

