Site icon NTV Telugu

D55 :ధనుష్-రాజ్‌కుమార్ పెరియసామి మూవీ షురూ.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి, శ్రీలీల.. క్రేజీ మల్టీస్టారర్!

Dhanush, D55 Movie, Sai Pallavi, Sreeleela

Dhanush, D55 Movie, Sai Pallavi, Sreeleela

వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్, తన 55వ సినిమా కోసం ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామితో జతకట్టారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన ‘వండర్‌బార్ ఫిల్మ్స్’,’ఆర్ టేక్ స్టూడియోస్’ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే నేడు (శనివారం) జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు శంకర్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

Also Read : Allu-Arjun : హీరో రెమ్యునరేషన్ అంటే ఇలా ఉండాలి! బన్నీ చూపించిన కొత్త దారి

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. టాలీవుడ్ సెన్సేషన్స్ సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తుండటం. ‘అమరన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న వరుసగా రెండో సినిమా ఇది. అలాగే, ‘పరాశక్తి’ అనే చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి, రెండో సినిమానే స్టార్ హీరో ధనుష్ సరసన అవకాశం రావడం విశేషం. మరోవైపు, మాస్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాకు గ్లోబల్ లెవల్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ల ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version