Dulquer Salman & Prithviraj: స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై కస్టమ్స్ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. భూటాన్ నుంచి లగ్జరీ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తూ, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొచ్చిలోని మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కూడా అధికారులు విచారణ చేశారు.
Also Read : Akshay Kumar: మహర్షి వాల్మీకి ట్రైలర్ వీడియోలు నకిలీ..
Also Read
- Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. 'పెద్ది' షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
- Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
- IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
- KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
‘ఆపరేషన్ నమ్ఖోర్’ (భూటాన్ భాషలో వాహనం) పేరుతో కేరళ అంతటా కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టి పురం, త్రిస్సూర్ సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. అధికారులు భూటాన్ నుంచి హై-ఎండ్ లగ్జరీ SUVలు ల్యాండ్ క్రూయిజర్లు, ప్రాడో, ల్యాండ్ రోవర్లు వంటి వాహనాలను అక్రమంగా భారత్లోకి దిగుమతి చేసుకున్నారని అనుమానిస్తున్నారు. భూటాన్లో ఈ వాహనాలను మొదట రూ.5 లక్షలకంటే తక్కువ ధరలో కొనుగోలు చేస్తారు. ఆపై కేరళ నంబర్ ప్లేట్తో రీమోడల్ చేసి, దాదాపు రూ.40 లక్షల వరకు అమ్ముతారు. అసలు ధర కోట్లలో ఉండే ఈ వాహనాలను పన్నులు చెల్లించకుండా విక్రయించడం వలన పన్ను చెల్లింపు తప్పులు జరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది మలయాళ నటులు వాటిలో కొన్నింటిని కొనుగోలు చేశారని కస్టమ్స్ అనుమానించింది. దీంతో దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. అయితే, ఆ ఇద్దరి వద్ద ఎలాంటి అక్రమ వాహనాలు లేవని అధికారులు ధ్రువీకరించారు. ఈ రవాణా వెనుక హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక రాకెట్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భూటాన్లోని వాహనాలను వేలంలో తక్కువ ధరలకు విక్రయించి, భారతదేశంలో కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా అక్రమంగా దిగుమతి చేస్తున్నారు. తరువాత వాటిని హిమాచల్ ప్రదేశ్కు రవాణా చేసి, తాత్కాలిక చిరునామాలను ఉపయోగించి నమోదు చేస్తారు. ఈ విధంగా నటులు, వ్యాపార ప్రముఖులకు అధిక ధరలకు విక్రయిస్తారు. భూటాన్లో చట్టబద్ధంగా విక్రయించినప్పటికీ, సరైన పన్ను చెల్లించకుండా భారతదేశంలో దిగుమతి చేయడం సెలబ్రిటీలకు కూడా సమస్యలకు దారి తీస్తుంది.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..