మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ – చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్ తో సహా టీమ్ అందరికీ మంచిపేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. రఘు కారుమంచి మాట్లాడుతూ – చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ సినిమాతో డైరెక్టర్ మైను ఖాన్, నిర్మాత జయశ్రీ గారు మంచి విజయాన్ని దక్కించుకోవాలని కోరుతున్నా. టీమ్ లోని అందరికి నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. చండీ దుర్గమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే మూవీ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.