NTV Telugu Site icon

Tolly Wood :సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ ..

Untitled Design (20)

Untitled Design (20)

టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాయి, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ తదితరులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “టి సి ఏ 2006లో స్థాపించారు. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఆర్గనైజర్ సాయి ఒక చారిటీ కోసం ఈ క్రికెట్ కార్నివాల్ ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

మరో హీరో తరుణ్ మాట్లాడుతూ “ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సీజన్ 1 లో కూడా గెలిచాం. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తాము అని కచ్చితంగా చెప్తున్నాను. ద రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం ఆడుతున్నాం.  నవంబర్ లో జరిగే ఈవెంట్ కి సెప్టెంబర్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఉంటుంది” అని తెలిపారు . మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ “ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము.  సీజన్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని  అన్నారు.  వీరితో  పాటు మిగతా నటీనటులు తమ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.

Also Read: UAE : UAE ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్న మరొక తెలుగు హీరో..ఎవరా హీరో..?