NTV Telugu Site icon

Ashwinidath: మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం అశ్వనీదత్ సినిమా.!

Untitled Design (18)

Untitled Design (18)

ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌హేష్ బ‌ర్త్ డే రోజు అత‌డి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మురారి థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మ‌హేష్‌బాబు బ‌ర్త్‌డే రోజు ఈ మూవీ స్పెష‌ల్ షోస్‌ను తెలుగు రాష్ట్రాల‌తో ఓవ‌ర్‌సీస్‌లో స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. రీ రిలీజ్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వంద‌ల‌కుపైగా థియేట‌ర్ల‌లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. కానూరి అంత అంటే ఒకరోజు ముందు అనగా ఆగస్టు 8న మహేశ్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. కాని ఒక్కడు చిత్రాన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా మహేశ్ బాబును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్వినీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దత్ మాట్లాడుతూ” వచ్చే ఏడాది మహేశ్ మొదటి సినిమా రాజకుమారుడు రీరిలీజ్ కి ప్లాన్ చేస్తాను. మహేశ్ అభిమానులు ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు లేదంటే కాస్త ముందుగా నా ద్రుష్టి కి తీసుకొని వస్తే ఈ సంవత్సరం విడుదల చేసే వాళ్ళము” అని అన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు మహేశ్ బాబుకు మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందించింది. మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ముందుగా ప్లాన్ చేసి ఉంటె రాజకుమారుడు కూడా సంవత్సరం రీరిలీజ్ అయుండేది.

Also Read: Double ismart: ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బడా నిర్మాత..ఎవరంటే..?