టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రాకా’ విడుదలకు సంబంధించి సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.సన్ పిక్చర్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ రోజే ‘మేక్ వే ఫర్ ద కింగ్’ అంటూ సోషల్ మీడియాను షేక్ చేసింది.
‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడం అలాగే షారుఖ్ ఖాన్తో ‘జవాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అట్లీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పునర్జన్మలు, డిఫ్రెంట్ వరల్డ్ కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి అట్లీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కిస్తున్నారు. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం..ఇండియన్ సినిమా పరిశ్రమలో ఈ దశాబ్దంలోనే అత్యంత భారీ ఈవెంట్ చిత్రంగా ‘రాకా’ నిలవనుంది. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

