‘సింహా’, ‘లెజెండ్వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ
అఖండ. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా
అఖండఅనే పవర్ఫుల్ టైటిల్తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్తో దూసుకుపోతోందని, ఇప్పటికే ఈ టీజర్ 31 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించిందని నిర్మాత తెలిపారు. ఈ టీజర్ సృష్టించిన సెన్సేషన్తో ప్రేక్షకాభిమానుల్లో
అఖండ` మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయని, ఈ నెల 30 వరకూ నాన్స్టాప్గా జరిగే షెడ్యూల్తో దాదాపుగా షూటింగ్ పూర్తవుతుందని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్తో పాటు భారీతారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.