Mahatma: గాంధీ హత్యోదంత నేపథ్యంలో ‘1948 అఖండ భారత్’!
గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికీ తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం… దాదాపు ఎనిమిది గంటల పాటు గాడ్సే చెప్పిన మరణ వాగ్మూలం బయటకు రాకపోవడమే. ఈ అంశాలను ప్రామాణికంగా అధ్యయనం చేసి డి. ఈశ్వర్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘1948 అఖండ భారత్’. సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం. వై. మహర్షి ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లోనూ, ప్రధానమైన అంతర్జాతీయ భాషల్లోనూ ఈ నెల 12న విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్… ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే… ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు.
ఈ చిత్ర రచయిత, గాడ్సే పాత్రధారి డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ, “గాడ్సే మరణ వాగ్మూలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో నిషేధించింది. ఆయన్ని ఉరి తీసిన మూడు దశాబ్దాల తర్వాత అది బయటకు వచ్చినా ప్రచురితం కాకుండా అడ్డుకుంది. అలా 70 సంవత్సరాలు దాచి పెట్టిన నిజాలను పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ ను తయారుచేశాం. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి. హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీశాం” అని అన్నారు. చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి. బాబు మాట్లాడుతూ, ”11, 372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9షెడ్యూల్స్ లో… ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని చెప్పారు.
Also Read
- Lyricist Chandrabose's Brother: చంద్రబోస్ సోదరుడు మృతిపై అనుమానాలు?
- Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- Bollywood : బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
విడుదల తేదీని తెలియచేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ‘బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ తరహాలో ‘1948 – అఖండ భారత్’ చిత్రం విజయం సాధించాల’ని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే… తలకిందులుగా తపస్సు చేసినా… ఈ చిత్రం సెన్సార్ అయ్యేది కాదని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ కూడా పాల్గొన్నారు. ‘1948 అఖండ భారత్’ చిత్రంలో గాంధీగా రఘునందన్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Viral: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్.. TMC పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!
-
Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
-
Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు
-
TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్లో తెగ వెతికేస్తున్నారుగా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!