Mahatma: గాంధీ హత్యోదంత నేపథ్యంలో ‘1948 అఖండ భారత్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికీ తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం… దాదాపు ఎనిమిది గంటల పాటు గాడ్సే చెప్పిన మరణ వాగ్మూలం బయటకు రాకపోవడమే. ఈ అంశాలను ప్రామాణికంగా అధ్యయనం చేసి డి. ఈశ్వర్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘1948 అఖండ భారత్’. సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం. వై. మహర్షి ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లోనూ, ప్రధానమైన అంతర్జాతీయ భాషల్లోనూ ఈ నెల 12న విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్… ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే… ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు.
ఈ చిత్ర రచయిత, గాడ్సే పాత్రధారి డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ, “గాడ్సే మరణ వాగ్మూలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో నిషేధించింది. ఆయన్ని ఉరి తీసిన మూడు దశాబ్దాల తర్వాత అది బయటకు వచ్చినా ప్రచురితం కాకుండా అడ్డుకుంది. అలా 70 సంవత్సరాలు దాచి పెట్టిన నిజాలను పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ ను తయారుచేశాం. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి. హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీశాం” అని అన్నారు. చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి. బాబు మాట్లాడుతూ, ”11, 372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9షెడ్యూల్స్ లో… ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని చెప్పారు.
Also Read
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
- Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్మార్క్ అంటూ కామెంట్స్!
- Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
విడుదల తేదీని తెలియచేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ‘బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ తరహాలో ‘1948 – అఖండ భారత్’ చిత్రం విజయం సాధించాల’ని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే… తలకిందులుగా తపస్సు చేసినా… ఈ చిత్రం సెన్సార్ అయ్యేది కాదని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ కూడా పాల్గొన్నారు. ‘1948 అఖండ భారత్’ చిత్రంలో గాంధీగా రఘునందన్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..