ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రికి వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని, సినీ పరిశ్రమ వైజాగ్ కూడా ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఛాంబర్ మరోసారి సమావేశమై చర్చిస్తామని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతామన్నారు. అంతేకాకుండా.. చిరంజీవి పెద్ద కదాన్న ఆయనే మాకు పెద్డ అని, ఒక వేడుక ఏర్పాటు చేసి సీఎంలను సన్మానిస్తామని, ఇద్దరు ముఖ్యమంత్రులకు సన్మానం చేసేందుకు త్వరలోనే చిరంజీవిని కలుస్తామని ఆయన వెల్లడించారు.
