Sachin Joshi : ఎట్టకేలకు బెయిల్ పై విడుదలైన హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆయన బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. అయితే 2021 నుంచి జైలులో ఉన్న సచిన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆ వివరాల్లోకి వెళ్తే… మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం / మళ్లించడం వంటి ఆరోపణలపై 2021 ఫిబ్రవరి 14న జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు మంజూరు చేసిన మెడికల్ బెయిల్పై బయట ఉన్నారు.
తాజాగా ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రత్యేక PMLA కోర్టు వ్యాపారవేత్త, నటుడు, నిర్మాత సచిన్ జోషికి సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో ఇద్దరి పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భారత్ విడిచి వెళ్లరాదని, అలాగే పాస్పోర్టును ఈడీకి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణకు విఘాతం కలిగించే లేదా “నేరపు రాబడి”కి సంబంధించిన ఏదైనా చర్యలో పాల్గొనవద్దని జోషిని కోర్టు ఆదేశించింది.
Also Read
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
- Suriya - Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
- Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !
ఈడీ… ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవితా పాటిల్ ద్వారా బెయిల్ ఆర్డర్ ఆమోదించిన తర్వాత, తీర్పును సవాలు చేయడానికి, బెయిల్ ఆర్డర్ అమలుపై స్టే విధించడానికి మూడు వారాల గడువును అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది అబాద్ పొండా, న్యాయవాది సుభాష్ జాదవ్ ద్వారా జోషి బెయిల్ కోసం అభ్యర్థించారు. దర్యాప్తు సంస్థ తనతో ముడిపడి ఉన్న “నేర ప్రక్రియలను” నిర్ధారించడంలో విఫలమైందనివిఫలమైందని పేర్కొన్నారు.,
మార్చి 2020లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎం/ఎస్ ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లపై ED దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణ సమయంలో కీలక వ్యక్తుల నివాస, కార్యాలయాలతో సహా వివిధ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఆ తరువాత ED 2021 జనవరి 27న M/s ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లు బాబూలాల్ వర్మ, కమల్ కిషోర్ గుప్తాలను PMLA, 2002 కింద అరెస్టు చేసింది. అందులో జోషి ప్రమేయం ఉన్నట్లు ఈడీ కనుగొంది. దాదాపు రూ.87 కోట్లను దారి మళ్లించినట్టు గుర్తించారు. దీంతో జోషిని పిలిపించి విచారించారు.
తాజావార్తలు
-
Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
-
BJP Protest: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట.. తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.!
-
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
-
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!