అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపానం’. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read :Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
ఈ సందర్భంగా ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీవిష్ణు ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘పరమపద సోపానం’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. అర్జున్ అంబటి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు నాగ శివ కూడా నాకు చాలా కాలం నుండి తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, మంచి హార్డ్ వర్కర్. ఈ సినిమాతో ఆయన కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను.’పరమపద సోపానం’ సినిమాకి పనిచేసిన వారందరికీ నా బెస్ట్ విషెస్” అని చెప్పుకొచ్చారు.
ఇక ‘పరమపద సోపానం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ ఎలిమెంట్ ను కూడా దర్శకుడు నాగ శివ ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు స్పష్టమవుతుంది. హీరో అర్జున్ అంబటి కటౌట్ ని యాక్షన్ ఎపిసోడ్స్ కి వాడిన తీరు, రొమాంటిక్ సన్నివేశాలు, బీచ్ సీక్వెన్స్..లు వంటివి చూస్తుంటే తన గురువు పూరీ జగన్నాథ్ మార్కు ‘మాస్ అండ్ క్లాస్’ శైలిని దర్శకుడు నాగ శివ ఒంటబట్టించుకున్నారని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ‘పరమపద సోపానం’ ఏప్రిల్ 24కి ముస్తభవుతోంది అనే హోప్స్ ని కూడా ట్రైలర్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు.
