బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. దానితో పాటే తమిళ సినిమా ‘కర్ణన్’ రీమేక్ లోనూ నటించబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించాడు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ నూ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనిని అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ నిర్మించబోతున్నారు. రెండు రోజుల ముందు రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తానూ తగ్గేది లే అంటున్నాడు సాయి శ్రీనివాస్.
దీపావళి కానుకగా గురువారం ‘స్టూవర్ట్ పురం దొంగ’ పోస్టర్ ను విడుదల చేశారు. శుక్రవారం మరో పోస్టర్ ను సాయి శ్రీనివాస్ ట్వీట్ చేశాడు. అతని గెటప్ సూపర్ గా ఉందంటూ నెటిజన్లు విశేషంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద ‘ఛత్రపతి’ రీమేక్ తర్వాత ‘కర్ణన్’ రీమేక్ కంటే ముందే ‘స్టూవర్ట్ పురం దొంగ’ను సెట్స్ పైకి తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది
