విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ కొద్దిరోజుల్లో ఓపెన్ కానుంది. విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇనార్బిట్ మాల్లో ఆసియన్ అల్లు అర్జున్ (AAA) మల్టీ ప్లెక్స్ పనులు తాజాగా ప్రారంభించారు. 2023లోనే 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి పునాది పడింది. దక్షిణాదిలోనే విశాఖలో నిర్మించే మాల్ అతిపెద్దది.
Also Read : Kannada : అబ్బే రూ. 100కోట్లు ఇవ్వందే సినిమా చేయలేము
జులై 10న ఆసియన్ సునీల్, అల్లు అరవింద్లతో పాటు వారి టీమ్ విశాఖపట్నం చేరుకుంది. ఇనార్బిట్ మాల్లో (AAA) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తికావాలని ప్రణాళికలు వేశారు. ఇప్పటికే థియేటర్లో ఉండాల్సిన ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్ ఫైనల్ చేశారట. ముల్టీ ప్లెక్స్కు కావాల్సిన ఫర్నీచర్ అంతా విదేశాల నుంచే తెప్పిస్తున్నారు. విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్ (AAA) ఉండాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 8 స్క్రీన్స్ ఈ మల్టీప్లెక్స్ నందు ఉంటాయి. 2026 సమ్మర్లో ప్రారంభం కానుందని ప్రకటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కు హైదరాబాద్ లో AAA మల్టిప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే.