Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి క్లైమాక్స్ లేకుండానే ఒక సినిమా విడుదలైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమాకి అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించింది సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి కావడం విశేషం. తాజాగా అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అక్షయ్ కుమార్, తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. తన తొలి సెలబ్రిటీ క్రష్ శ్రీదేవి అని ఆయన వెల్లడించారు. దాంతో హోస్ట్ కరణ్ జోహార్, ఇద్దరూ కలిసి నటించిన ‘మేరీ బీవీ కా జవాబ్ నహీ’ సినిమాను ప్రస్తావించారు. అప్పుడే ఆ సినిమా వెనుక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అక్షయ్ బయటపెట్టారు. ఆ సినిమా విడుదల కాలేదా అని కరణ్ ప్రశ్నించగా, అక్షయ్ స్పందిస్తూ విడుదలైందని, కానీ క్లైమాక్స్ ను చిత్రీకరించకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలిపారు. సినిమాలో చివరి భాగంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పే సన్నివేశం వరకు మాత్రమే షూటింగ్ జరిగిందని, కానీ రివేంజ్ తీర్చుకునే క్లైమాక్స్ మాత్రం షూటింగ్ అసలు జరగనేలేదని చెప్పారు. చివరికి సినిమాలో ‘ఆ తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు’ అనే ట్యాగ్ తో కథను ముగించారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఇలాంటి అనుభవం మరొకటి లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
పంకజ్ పరాశర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎం. ఇక్బాల్ నిర్మించారు. అక్షయ్ కుమార్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, గుల్షన్ గ్రోవర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, లక్ష్మీకాంత్ బెర్డే, కిరణ్ కుమార్, నీనా గుప్తా, జయశ్రీ టి., జగదీష్ రాజ్, బ్రిజ్ గోపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1994లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ, పలు కారణాలతో దాదాపు పదేళ్ల పాటు విడుదల కాలేదు. చివరకు 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రం 1992లో విడుదలైన తెలుగు హిట్ మూవీ ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’కు రీమేక్గా రూపొందింది. అక్షయ్ కుమార్, శ్రీదేవి కలిసి నటించిన ఏకైక చిత్రంగా కూడా ఇదే కావడం విశేషం.
- Tags
- Akshay Kumar
- cinema
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!