Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి క్లైమాక్స్ లేకుండానే ఒక సినిమా విడుదలైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమాకి అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించింది సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి కావడం విశేషం. తాజాగా అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అక్షయ్ కుమార్, తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. తన తొలి సెలబ్రిటీ క్రష్ శ్రీదేవి అని ఆయన వెల్లడించారు. దాంతో హోస్ట్ కరణ్ జోహార్, ఇద్దరూ కలిసి నటించిన ‘మేరీ బీవీ కా జవాబ్ నహీ’ సినిమాను ప్రస్తావించారు. అప్పుడే ఆ సినిమా వెనుక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అక్షయ్ బయటపెట్టారు. ఆ సినిమా విడుదల కాలేదా అని కరణ్ ప్రశ్నించగా, అక్షయ్ స్పందిస్తూ విడుదలైందని, కానీ క్లైమాక్స్ ను చిత్రీకరించకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలిపారు. సినిమాలో చివరి భాగంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పే సన్నివేశం వరకు మాత్రమే షూటింగ్ జరిగిందని, కానీ రివేంజ్ తీర్చుకునే క్లైమాక్స్ మాత్రం షూటింగ్ అసలు జరగనేలేదని చెప్పారు. చివరికి సినిమాలో ‘ఆ తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు’ అనే ట్యాగ్ తో కథను ముగించారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఇలాంటి అనుభవం మరొకటి లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
- Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
- Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు... 'కల్కి'పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
- Slum Dog Release : పూరీ జగన్నాథ్ 'స్లమ్డాగ్' సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
పంకజ్ పరాశర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎం. ఇక్బాల్ నిర్మించారు. అక్షయ్ కుమార్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, గుల్షన్ గ్రోవర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, లక్ష్మీకాంత్ బెర్డే, కిరణ్ కుమార్, నీనా గుప్తా, జయశ్రీ టి., జగదీష్ రాజ్, బ్రిజ్ గోపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1994లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ, పలు కారణాలతో దాదాపు పదేళ్ల పాటు విడుదల కాలేదు. చివరకు 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రం 1992లో విడుదలైన తెలుగు హిట్ మూవీ ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’కు రీమేక్గా రూపొందింది. అక్షయ్ కుమార్, శ్రీదేవి కలిసి నటించిన ఏకైక చిత్రంగా కూడా ఇదే కావడం విశేషం.
- Tags
- Akshay Kumar
- cinema
తాజావార్తలు
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?