NTV Telugu Site icon

Aishwarya Rajinikanth: ధనుష్ తో విడాకులు.. రెండేళ్ల నుంచి సేఫ్ గా ఉన్నా

Dhanush

Dhanush

Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. రెండు కుటుంబాలు వీరిద్దరూ కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. కానీ, వాటిలో ఎలాంటి నిజం లేదు. అలా అనుకుంటూనే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఎవరి కెరీర్ ను వారు బిల్డ్ చేసుకుంటున్నారు. ధనుష్ వరుస సినిమాలతో బిజీగా మారగా.. ఐశ్వర్య డైరెక్టర్ గా మారి సినిమాలు తీస్తుంది. ఇటీవలే తండ్రి నటించిన లాల్ సలామ్ కు దర్శకత్వం వహించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య.. తన విడాకుల తరువాత జీవితం గురించి నోరు విప్పింది.

ధనుష్ తో విడాకుల తరువాత మీ జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్నకు ఐశ్వర్య మాట్లాడుతూ.. “రెండేళ్లుగా నేను ఒంటరిగానే ఉంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సింగిల్ లైఫ్ ను ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నాను. ఈ రెండేళ్లలో నేను గమనించిన విషయం ఏంటంటే.. మనం ఒంటరిగా ఉన్నప్పుడే సేఫ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా.. పిల్లల కోసం గతంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చా.. ఇప్పుడు కొనసాగిస్తున్నాను. ప్రపంచం ఎంతో ఫాస్ట్ గా పరిగెడుతోంది. నేను కూడా అందులో ఉండాలనుకుంటున్నాను. సింగిల్ లైఫ్ లో టైమ్ అస్సలు తెలియడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.