NTV Telugu Site icon

ISPL Chennai Team: చరణ్, అమితాబ్, హృతిక్ కి పోటీగా బరిలోకి సూర్య

Ispl Chennai Team

Ispl Chennai Team

Actor Suriya Announces his ownership of ISPL Chennai Team: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) లో చెన్నై (తమిళనాడు) జట్టు కొనుగోలు చేసి యజమానిగా లీగ్ లో చేరినట్లు నటుడు సూర్య ఈరోజు తెలిపారు . ఈ వార్తను నటుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జరగనుంది, ఈ ఫార్మాట్ పది ఓవర్లకే ఉంటుంది. ఐపీఎల్‌, టీఎన్‌పీఎల్‌ వంటి సిరీస్‌ల ద్వారా భారత్‌లో టీ20 క్రికెట్‌ సిరీస్‌ పాపులర్‌ అయినట్లే.. తాజాగా 10 ఓవర్లతో నిర్వహించే టీ10 సిరీస్‌ కూడా పాపులర్‌ అవుతోంది. ఆ విధంగా భారత్‌లోనూ ఈ సిరీస్‌ జరగనుంది. ఐఎస్‌పీఎల్‌గా పిలువబడే ఈ సిరీస్‌లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, శ్రీనగర్‌లకు చెందిన ఆరు జట్లు పాల్గొంటాయి.

Devil: డెవిల్ రిలీజ్ కి ముందు నవీన్ మేడారం బహిరంగ లేఖ.. అదేదీ నిజం కాదంటూ!

2024 మార్చి 2 నుంచి 9 వరకు జరగనున్న ఈ ISPL సిరీస్‌లో ప్రతి జట్టును సినీ ప్రముఖులు కొనుగోలు చేస్తున్నారు. ముంబై జట్టును నటుడు అమితాబ్ బచ్చన్, బెంగళూరు జట్టును బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, శ్రీనగర్ జట్టును అక్షయ్ కుమార్, హైదరాబాద్ జట్టును తెలుగు నటుడు రామ్ చరణ్ కొనుగోలు చేశారు. అయితే కోల్‌కతా, చెన్నై జట్ల యజమానులు గోప్యంగా ఉంచగా, ఇప్పుడు చెన్నై జట్టు యజమాని ప్రకటన వెలువడింది. అందుకు తగ్గట్టుగానే చెన్నై టీమ్‌ని నటుడు సూర్య కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కోల్‌కతా జట్టు యజమాని ఎవరన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా ఉన్న సూర్య. నటనతో పాటు నిర్మాణ సంస్థ, అగరం ఫౌండేషన్ వంటి పలు పనులు కూడా చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం సూర్య సిరుత్తై శివ దర్శకత్వంలో ‘వడివాసల్‌’, ‘సూర్య 43’ వంటి సినిమాలను చేస్తున్నాడు.