కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9:45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శ్రీమతి సునీత సమర్పణలో, అజయ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. సూట్ వేసుకున్న హీరో చేతిలో పిస్టల్ తో టార్గెట్ ఎయిమ్ చేశారు. మరి ఆ టార్గెట్ ఏంటో, ఎందుకో తెలియాలంటే సినిమాలో చూడాలి. ‘ఈ సినిమా ఆది సాయి కుమార్ కు కొత్త ఇమేజ్ ని తెస్తుందని, ఆయన చేస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనీష్ సొలమన్, సినిమాటోగ్రఫీ : గంగనమోని శేఖర్.