Aadavallu Meeku Joharlu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోయిన్లతో పాటు మరో గెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 4న ఈ సినిమాలో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీమణులు రాధికా శరత్కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ను మరింత స్పెషల్ గా చేయబోతున్నారు. ఈ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు ఓ స్టార్ డైరెక్టర్ గెస్ట్ గా రాబోతున్నారు.
Read Also : Bheemla Nayak : ఆర్జీవీ రివ్యూ… ఏమన్నాడంటే?
Also Read
“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేస్తున్న కీర్తి సురేష్, సాయి పల్లవి అదే వేదికపై థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేయనున్నారు. ఫిబ్రవరి 27న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు జీనియస్ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
- Tags
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!