Vastu Tips: వేసవిలో మట్టి కుండ తీసుకున్నారా..? మీ అదృష్టం మారలంటే ఇంట్లో ఈ దిశలో పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: వేసవి సమయంలో సామాన్యుడి ఫ్రిజ్గా మట్టి కుండలకు పేరు ఉంది.. ఇక చాలా మంది ఫ్రిజ్ వాటర్ తీసుకోవడం ఇష్టం లేనివారు కూడా మట్టి కుండలను తీసుకోవడం చూస్తుంటాం.. వేసవి కాలంలో మట్టి కుండలు ఉపయోగించడం శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, వాస్తు పరంగా కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఇంట్లో చేసే చిన్న మార్పులు సానుకూల శక్తిని పెంచి, ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు కూడా మీ ఇంట్లో సుఖశాంతులు, సంపద పెరగాలని కోరుకుంటే ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు..
* మొదటిగా, ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుభ్రమైన నీటితో నింపిన మట్టి కుండను ఈశాన్యంలో ఉంచితే ఇంట్లో చల్లదనం, ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని నమ్మకం.
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
* వైశాఖ మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజ చేయడం ఎంతో మంగళకరంగా భావిస్తారు. ప్రతి ఉదయం తులసి మొక్కకు నీరు పోయడం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. దీని వల్ల ప్రతికూల శక్తి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
* ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉత్తర దిశలోని ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి సులభంగా ప్రవహిస్తుంది. చిందరవందరగా ఉన్న ప్రదేశాల్లో మంచి శక్తి నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
* మనీ ప్లాంట్ను ఇంట్లో ఉంచడం కూడా శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. దీనిని నీటితో నింపిన గాజు పాత్రలో పెట్టి ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద, అభివృద్ధి పెరుగుతాయని చెబుతారు. ఇది మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.
* ఇక, ప్రతి ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లడం కూడా ఒక మంచి అలవాటు. ఇది ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. కావాలంటే ప్రవేశ ద్వారం దగ్గర నీటితో నింపిన రాగి పాత్రను ఉంచుకోవచ్చు. ఇలా.. ఈ చిన్నచిన్న వాస్తు మార్పులు పాటిస్తే, మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థికాభివృద్ధి పెరిగి జీవితం మరింత సంతోషంగా మారుతుంది.
తాజావార్తలు
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!