Ragi recipe: ప్రస్తుతం ఉన్న ఫుడ్ అలవాట్ల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంతో తృణధాన్యాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా రాగి వంటకాల ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా షుగర్తో బాధ పడుతున్న వారికి రాగి ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు. దీనిలో ఉండే B1 ,B2 , B3, B6, B9 వంటి విటమిన్లు ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీకి ఉపయోగపడుతుంది.
షుగర్ ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా రాగి జావా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం సాధారణంగా మరుగుతున్న నీటిలో, నీటిలో కలిపిన రాగి మిశ్రమాన్ని కలపడం ద్వారా రాగి జావా తయారు అవుతుంది. ప్రతీ రోజు ఇలాగే తాగాలంటే బోర్ కొడుతుంది. దీని కోసమే ఇలా ప్రత్యేకమైన రాగి జావా తయారు చేసుకుంటే, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
స్పెషల్ రాగి జావా తయారీ విధానం:
* ముందుగా ఒక ప్యాన్ లో కాసింత నెయ్యి లేదా ఆయిల్ వేసి, వేడి అయ్యాక అందులో సన్నగా కట్ చేసిన క్యారెట్, వెల్లుల్లి తరుమును వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుని వేగే దాకా ఆగాలి. క్యారెట్తో పాటే కార్న్, పచ్చి బఠాణీ గింజలను వేసుకుని వేగేలా కలుపుకోవాలి.
* దీని తర్వాత నీటిని పోసుకుని మరిచేలా కలుపుకోవాలి. నీరు మరిగే సమయంలో రాగి మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. ఉండలు లేకండా రాగి పొడిని ముందుగానే నీటిలో కలుపుకుని ఒక మిశ్రమంగా చేసుకోవడం మరిచిపోవద్దు. ఇలా చేస్తే మరుగుతున్న నీటిలో పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఉండలు ఉండవు. మిశ్రమం ముద్దలుగా ఉండదు. చివరకు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కొందరు గార్నిష్ చేయడానికి కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకుంటారు.
* ఈ విధానంలో రాగి జావా తయారు చేసుకోవడంతో మంచి రుచి వస్తుంది. దీంతో పాటు కార్న్, క్యాబేజ్, పచ్చి బఠాణీ వేసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు మంచిది. వెల్లుల్లి వల్ల రుచితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంంది.
