రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగానే చాలా మందికి ఒంటినొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా కుదరదు. దీంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుని నిద్రపోతుంటారు. ఒళ్లు నొప్పులతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా మరి..
ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు భుజం నొప్పి తగ్గదు. ఇక భుజం నొప్పితో తీవ్రంగా బాధపడేవారు ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.
1. ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల పసుపు అలాగే నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని మీ భుజాలకు అప్లై చేసిన తరువాత అది బాగా డ్రై అయ్యే వరకూ ఉండాలి. ఆ తర్వాత వేడి నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ ఉదయం ఇంకా సాయంత్రం కనుక చేస్తే మీకు మీ తీవ్రమైన భుజం నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం అనేది మీకు లభిస్తుంది.
2. ఒక బకెట్ వేడి నీటిలో ఒక అర కప్పు వరకు ఎప్సోమ్ ఉప్పు వేసి బాగా కరిగించండి. ఇక ఈ నీళ్లతో స్నానం చేయండి. ఇలా ప్రతి రోజు ఉదయం, సాయంకాలం కనుక ఇలా స్నానం చేస్తే మీ కండరాల ఒత్తిడి అనేది తగ్గిపోయి రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడుతుంది.
3. ఐస్ థెరపీ కూడా తీవ్రమైన భుజాల నొప్పిని ఎంతో సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్కలను చుట్టి దానిని మీ భుజాలపై ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెట్టుకోవాలి . ఇలా రోజూ చేస్తే క్రమ క్రమంగా మీ భుజం నొప్పి అనేది తగ్గుతుంది.
ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపోవడంతోపాటు శరీరానికి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా ఉంటుంది.