Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
- ఏసీలు వాడుతున్న వారిలో తెలియకుండా అనారోగ్య సమస్యలు..
- డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులతో ప్రమాదం..
- జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dangers of AC: దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరింది. మేలో మరింత తీవ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో ఏసీల వినియోగాన్ని పెంచారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీలు మన రూమ్ టెంపరేషన్ను తగ్గించి, మనకు సుఖాన్ని ఇస్తున్నప్పటికీ వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్, అలసట, శ్వాస సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్:
Also Read
- Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- Ragi Punugulu - Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
- Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
- Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
ఏసీ గాలిలోని తేమను తగ్గిస్తుంది. వాతావరణం పొడిగా మారుతుంది. దీంతో మనకు దాహం అనిపించదు. నీరు తక్కువగా తాగుతారు. మనకు తెలియకుండానే మన శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఇలాంటి సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడి తల నొప్పి, అలసట, పొడి చర్మ, ఏకాగ్రతా లోపాలు ఏర్పడుతాయి.
శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం:
చల్లని, పొడి గాలి వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా చికాకు పడుతుంది. ఏసీ వాతావరణంలో ఎక్కువగా గడిపే వారు గొంతు పొడిగా మారడం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాసకోశ వ్యవస్థ చికాకు పడటం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆస్తమా, అలర్జీలు, సైనస్ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఏసీ యూనిట్లు ఉన్న గదులు పూర్తిగా మూసి ఉంటాయి. దీని వల్ల దమ్ము, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా వ్యాపిస్తాయి. ఇది పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతుంది.
టెంపరేచర్ షాక్:
ఏసీల వల్ల కొందరు ‘‘టెంపరేచర్ షాక్’’ అనే సమస్యను ఎదుర్కొంటారు. శరీరం బయట తీవ్రమైన వేడి నుంచి లోపల చల్లని వాతావరణానికి మారినప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. శరీరం ఆ ఉష్ణోగ్రతలకు అలవాటు పడటంతో ఇబ్బంది పడుతుంది. దీని వల్ల అలసట, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటివి జరుగుతాయి.
ఇలా చేస్తే సమస్యలకు చెక్:
ఎయిర్ కండిషనర్ను పూర్తిగా మారేయాల్సిన పని లేదు. ఏసీని 24-26 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సెట్ చేసుకోవాలి. శరీరంలో నీరు తగ్గకుండా దాహం వేయకపోయినా నీరు తాగాలి. నేరుగా ఏసీ గాలి శరీరానికి తగలకుండా చూసుకోవాలి.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!