Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
- ఏసీలు వాడుతున్న వారిలో తెలియకుండా అనారోగ్య సమస్యలు..
- డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులతో ప్రమాదం..
- జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dangers of AC: దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరింది. మేలో మరింత తీవ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో ఏసీల వినియోగాన్ని పెంచారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీలు మన రూమ్ టెంపరేషన్ను తగ్గించి, మనకు సుఖాన్ని ఇస్తున్నప్పటికీ వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్, అలసట, శ్వాస సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్:
Also Read
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
ఏసీ గాలిలోని తేమను తగ్గిస్తుంది. వాతావరణం పొడిగా మారుతుంది. దీంతో మనకు దాహం అనిపించదు. నీరు తక్కువగా తాగుతారు. మనకు తెలియకుండానే మన శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఇలాంటి సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడి తల నొప్పి, అలసట, పొడి చర్మ, ఏకాగ్రతా లోపాలు ఏర్పడుతాయి.
శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం:
చల్లని, పొడి గాలి వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా చికాకు పడుతుంది. ఏసీ వాతావరణంలో ఎక్కువగా గడిపే వారు గొంతు పొడిగా మారడం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాసకోశ వ్యవస్థ చికాకు పడటం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆస్తమా, అలర్జీలు, సైనస్ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఏసీ యూనిట్లు ఉన్న గదులు పూర్తిగా మూసి ఉంటాయి. దీని వల్ల దమ్ము, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా వ్యాపిస్తాయి. ఇది పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతుంది.
టెంపరేచర్ షాక్:
ఏసీల వల్ల కొందరు ‘‘టెంపరేచర్ షాక్’’ అనే సమస్యను ఎదుర్కొంటారు. శరీరం బయట తీవ్రమైన వేడి నుంచి లోపల చల్లని వాతావరణానికి మారినప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. శరీరం ఆ ఉష్ణోగ్రతలకు అలవాటు పడటంతో ఇబ్బంది పడుతుంది. దీని వల్ల అలసట, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటివి జరుగుతాయి.
ఇలా చేస్తే సమస్యలకు చెక్:
ఎయిర్ కండిషనర్ను పూర్తిగా మారేయాల్సిన పని లేదు. ఏసీని 24-26 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సెట్ చేసుకోవాలి. శరీరంలో నీరు తగ్గకుండా దాహం వేయకపోయినా నీరు తాగాలి. నేరుగా ఏసీ గాలి శరీరానికి తగలకుండా చూసుకోవాలి.
తాజావార్తలు
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
-
Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!