Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
- ఏసీలు వాడుతున్న వారిలో తెలియకుండా అనారోగ్య సమస్యలు..
- డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులతో ప్రమాదం..
- జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dangers of AC: దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరింది. మేలో మరింత తీవ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో ఏసీల వినియోగాన్ని పెంచారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీలు మన రూమ్ టెంపరేషన్ను తగ్గించి, మనకు సుఖాన్ని ఇస్తున్నప్పటికీ వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్, అలసట, శ్వాస సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్:
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
ఏసీ గాలిలోని తేమను తగ్గిస్తుంది. వాతావరణం పొడిగా మారుతుంది. దీంతో మనకు దాహం అనిపించదు. నీరు తక్కువగా తాగుతారు. మనకు తెలియకుండానే మన శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఇలాంటి సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడి తల నొప్పి, అలసట, పొడి చర్మ, ఏకాగ్రతా లోపాలు ఏర్పడుతాయి.
శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం:
చల్లని, పొడి గాలి వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా చికాకు పడుతుంది. ఏసీ వాతావరణంలో ఎక్కువగా గడిపే వారు గొంతు పొడిగా మారడం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాసకోశ వ్యవస్థ చికాకు పడటం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆస్తమా, అలర్జీలు, సైనస్ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఏసీ యూనిట్లు ఉన్న గదులు పూర్తిగా మూసి ఉంటాయి. దీని వల్ల దమ్ము, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా వ్యాపిస్తాయి. ఇది పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతుంది.
టెంపరేచర్ షాక్:
ఏసీల వల్ల కొందరు ‘‘టెంపరేచర్ షాక్’’ అనే సమస్యను ఎదుర్కొంటారు. శరీరం బయట తీవ్రమైన వేడి నుంచి లోపల చల్లని వాతావరణానికి మారినప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. శరీరం ఆ ఉష్ణోగ్రతలకు అలవాటు పడటంతో ఇబ్బంది పడుతుంది. దీని వల్ల అలసట, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటివి జరుగుతాయి.
ఇలా చేస్తే సమస్యలకు చెక్:
ఎయిర్ కండిషనర్ను పూర్తిగా మారేయాల్సిన పని లేదు. ఏసీని 24-26 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సెట్ చేసుకోవాలి. శరీరంలో నీరు తగ్గకుండా దాహం వేయకపోయినా నీరు తాగాలి. నేరుగా ఏసీ గాలి శరీరానికి తగలకుండా చూసుకోవాలి.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!