SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- 731 స్టెనోగ్రాఫర్ పోస్టులు
- మే 15, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు
- దరఖాస్తు ఫీజు రూ.100
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు మే 15, 2026 వరకు అధికారిక వెబ్సైట్, ssc.gov.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అభ్యర్థులకు మే 20, 21 తేదీలలో తమ దరఖాస్తు ఫారాలలో సవరణలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు. అభ్యర్థుల వయస్సును 2026 ఆగస్టు 1 నాటికి లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది.
Also Read
- Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
- NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
- IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
దరఖాస్తు ఫీజు
స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. రిజర్వేషన్ లేని అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ఎస్టీ మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది.
పరీక్షా విధానం
ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ విభాగాల నుండి 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, వీటికి 200 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను నైపుణ్య పరీక్షకు కూడా పిలుస్తారు. నైపుణ్య పరీక్షలో ఎంపికైన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.
పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 20 శాతం మార్కులు సాధించాలి.
తాజావార్తలు
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!