SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- 731 స్టెనోగ్రాఫర్ పోస్టులు
- మే 15, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు
- దరఖాస్తు ఫీజు రూ.100
ఇంటర్ పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు మే 15, 2026 వరకు అధికారిక వెబ్సైట్, ssc.gov.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అభ్యర్థులకు మే 20, 21 తేదీలలో తమ దరఖాస్తు ఫారాలలో సవరణలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు. అభ్యర్థుల వయస్సును 2026 ఆగస్టు 1 నాటికి లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది.
Also Read
- NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
- HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
- LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు
- CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే
దరఖాస్తు ఫీజు
స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. రిజర్వేషన్ లేని అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ఎస్టీ మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది.
పరీక్షా విధానం
ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ విభాగాల నుండి 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, వీటికి 200 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను నైపుణ్య పరీక్షకు కూడా పిలుస్తారు. నైపుణ్య పరీక్షలో ఎంపికైన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.
పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 20 శాతం మార్కులు సాధించాలి.
తాజావార్తలు
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!