SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- 731 స్టెనోగ్రాఫర్ పోస్టులు
- మే 15, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు
- దరఖాస్తు ఫీజు రూ.100
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు మే 15, 2026 వరకు అధికారిక వెబ్సైట్, ssc.gov.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అభ్యర్థులకు మే 20, 21 తేదీలలో తమ దరఖాస్తు ఫారాలలో సవరణలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు. అభ్యర్థుల వయస్సును 2026 ఆగస్టు 1 నాటికి లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది.
Also Read
- RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
దరఖాస్తు ఫీజు
స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. రిజర్వేషన్ లేని అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ఎస్టీ మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది.
పరీక్షా విధానం
ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ విభాగాల నుండి 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, వీటికి 200 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను నైపుణ్య పరీక్షకు కూడా పిలుస్తారు. నైపుణ్య పరీక్షలో ఎంపికైన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.
పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 20 శాతం మార్కులు సాధించాలి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!