SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- 731 స్టెనోగ్రాఫర్ పోస్టులు
- మే 15, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు
- దరఖాస్తు ఫీజు రూ.100
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు మే 15, 2026 వరకు అధికారిక వెబ్సైట్, ssc.gov.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అభ్యర్థులకు మే 20, 21 తేదీలలో తమ దరఖాస్తు ఫారాలలో సవరణలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు. అభ్యర్థుల వయస్సును 2026 ఆగస్టు 1 నాటికి లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది.
Also Read
- Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
దరఖాస్తు ఫీజు
స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. రిజర్వేషన్ లేని అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ఎస్టీ మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది.
పరీక్షా విధానం
ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ విభాగాల నుండి 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, వీటికి 200 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను నైపుణ్య పరీక్షకు కూడా పిలుస్తారు. నైపుణ్య పరీక్షలో ఎంపికైన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.
పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 20 శాతం మార్కులు సాధించాలి.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!