EPFO News: ఈపీఎఫ్ఓలో నమోదవుతున్న ఉద్యోగుల సంఖ్య వరుసగా 3వ నెలా.. తగ్గేదేలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సంఘటిత రంగంలో వరుసగా మూడు నెలల నుంచి ఈ స్థాయిలో ఉపాధి లభిస్తుండటం చెప్పుకోదగ్గ విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘జీఐసీ’ ఫండ్ రైజింగ్
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
బాండ్లను జారీ చేయటం ద్వారా 25 వందల కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించాలని జీఐసీ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ భావిస్తోంది. వచ్చే నెల 23వ తేదీన జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు షేర్ హోల్డర్ల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మూలధన వనరులను పెంచుకోవటానికి ఈ బాండ్లను ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో జారీ చేయనుంది.
సీనియర్ డైరెక్టర్లు.. లేటెస్ట్ సినిమాలు..
ఐటీకి రూ.28 కోట్లు
ఆదాయపు పన్ను విభాగానికి సుమారు లక్ష ఐటీఆర్-యు ఫైలింగ్స్ దాఖలు కాగా ట్యాక్స్ల రూపంలో దాదాపు 28 కోట్ల రూపాయలు సమకూరాయి. ఈ కొత్త ఐటీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను 2022-23 బడ్జెట్లో నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిందని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు.
2 వేలకు పైగా డిలీట్
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో 2 వేలకు పైగా లోన్ యాప్లను ఇండియా ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించటం, తప్పుడు సమాచారాన్ని చూపించటం, ఆఫ్లైన్ బిహేవియర్ సరిగా లేకపోవటం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి చెప్పారు. రానున్న రోజుల్లో విధానాలపరంగా మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అదనపు సీట్లు ప్లీజ్
రెండు దేశాల మధ్య విమాన ప్రయాణికుల రాకపోకల కోసం మరో 50 వేల సీట్లను అందుబాటులోకి తేవాలని దుబాయ్ ఇండియాని కోరింది. తమ విమానాలను ఇండియాలోని మరిన్ని ప్రాంతాలకు అనుమతించాలని కూడా రిక్వెస్ట్ చేసింది. భారతీయ విమాన ప్రయాణికులకు దుబాయే పెద్ద గమ్యస్థానం. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇరు దేశాల మధ్య వారానికి 65 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పెంచాలని దుబాయ్ తాజాగా అడిగింది.
హెచ్డీఎఫ్సీ పెట్టుబడి
గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 9.94 శాతం వాటా కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ ఇండియాలోని జీవిత బీమా రంగంలో వ్యాపారం నిమిత్తం లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. కెనడాకు చెందిన కామేష్ గోయెల్ అనే బిలియనీర్ దీనికి ప్రమోటర్. ఈ సంస్థలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు విడతల్లో 50 నుంచి 70 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!