US-Iran War: టార్గెట్ ‘‘ఖార్గ్ ఐలాండ్’’.. భూతల దాడులకు అమెరికా సిద్ధం..
- ఖార్గ్ ఐలాండ్ లక్ష్యంగా అమెరికా దాడులు..?
- ఇరాన్ కీలక ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్లాన్లో యూఎస్..
- భూతల దాడులు చేయాలనే ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల దాటింది. ఇప్పటికీ పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, అమెరికా దాడుల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమై ఉన్న యూఎస్ బలగాలు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ‘‘భూతల దాడులకు’’ సిద్ధమవుతోంది. ఇరాన్లో వారాల తరబడి భూతల దాడులు నిర్వహించేందుకు పెంటగాన్ సిద్ధమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ శనివారం నివేదించింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సాధారణ పదాది దళాలు ఇందులో భాగంగా ఉండచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ప్రణాళికకు ట్రంప్ ఆమోదం తెలుపుతారా.? లేదా? అనేది ఇంకా సస్పెన్స్గా మారింది. భూతల దాడులు పూర్తిస్థాయి ఇరాన్ ఆక్రమణగా మారదని నివేదిక పేర్కొంది.
Read Also: Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ముఖ్యంగా, ఇరాన్ ఆయువుపట్టుగా ఉన్న ‘‘ఖార్గ్ ద్వీపాన్ని’’ స్వాధీనం చేసుకునే దిశగా భూతల దాడులు ఉండే అవకాశం ఉంది. ఇరాన్ అతిపెద్ద చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో 90 శాతం ఖార్గ్ ఐలాండ్ నుంచే జరుగుతున్నాయి. ఇదే కాకుండా, అంతర్జాతీయ నౌకయానానికి హార్ముజ్ జలసంధిలో అడ్డుగా ఇరాన్ కోస్టల్ ఇన్స్టాలేషన్లను ధ్వంసం చేయాలనేది అమెరికా ప్లాన్. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకునే దిశగా భూతలదాడులు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే వేల సంఖ్యలో యూఎస్ మెరైన్స్, 82న ఎయిర్బోర్న్ డివిజన్ బలగాలను ఇప్పటికే మధ్యప్రాచ్యంలో మోహరించాయి. అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెప్పరని, యుద్ధం ఆపకపోతే నరకాన్ని చూపిస్తారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివీట్ హెచ్చరించారు. అయితే, అమెరికా అనుకున్నంత ఈజీగా ఈ ఆపరేషన్ సాగకపోవచ్చు. ఇరాన్ మెయిన్ ల్యాండ్ నుంచి 25 కి.మీ దూరంలో ఖార్గ్ ద్వీపం ఉంటుంది. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ సైన్యం ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉంది. ఖార్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడం సులభమే అయినప్పటికీ, యూఎస్ తన సైన్యాన్ని రక్షించుకోవడం సవాలుతో కూడుకున్నదిగా మారుతుంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!