Site icon NTV Telugu

US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

Iran

Iran

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. వాషింగ్టన్ పంపించిన సందేశాన్ని ఇరాన్ పెద్దలకు చేరవేశారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరగవచ్చని సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగానే మళ్లీ చర్చలు జరగొచ్చని సమాచారం.

ఇది కూడా చదవండి: Asim Munir: ఇరాన్‌లో ప్రత్యక్షమైన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఏం జరుగుతోంది?

40 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్‌తో అమెరికా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలమయ్యాయి. ఇక కాల్పుల విరమణ గడువు కూడా ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి శాంతి చర్చలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని నివేదికలు అందుతున్నాయి.

ఇది కూడా చదవండి: Bihar: శాఖలు కేటాయించిన సీఎం సామ్రాట్ చౌదరి.. కీలక శాఖ బీజేపీ దగ్గరే!

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఆయా దేశాల్లో ధరలు కూడా ఆకాశన్నంటాయి. మరోసారి చర్చలకు సిద్ధపడుతున్నారు. ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version