US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి
- కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి
- 11 మంది మృతి చెందినట్లు ట్రంప్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరేబియన్ సముద్రంలో వెనిజులా మాదకద్రవ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతి చెందారు. అంతర్జాతీయ జలాల ద్వారా అమెరికా వైపు మాదకద్రవ్యాలను రవాణా చేస్తుండగా ఈ దాడి జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో సంబంధాలున్న నార్కో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ట్రంప్ అన్నారు. ట్రెన్ డి అరగువా కార్టెల్కు చెందిన 11 మంది అనుమానితులను చంపినట్లు మంగళవారం వెల్లడించారు. అమెరికా దళాలకు ఎటువంటి హాని జరగలేదని వెల్లడించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలించే వారందరికీ ఇదే హెచ్చరిక అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Delhi: నేడు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
Also Read
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
TDA అని పిలువబడే ట్రెన్ డి అరగువాను విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ట్రెన్ డి అరగువా సంస్థ నికోలస్ మదురో నియంత్రణలో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ పేర్కొన్నారు. ఇది సామూహిక హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక అక్రమ రవాణా, యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ అర్ధగోళంలో హింస, ఉగ్రవాద చర్యలకు బాధ్యత వహిస్తుందని ట్రంప్ వివరించారు.
ఇది కూడా చదవండి: Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్పందిస్తూ.. తమ ప్రభుత్వంపై అమెరికా సైనిక చర్యను ముమ్మరం చేస్తోందని ఆరోపించారు. సైనిక బెదిరింపు ద్వారా పాలన మార్పును కోరుకుంటోందని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులా సాయుధ దళాలు.. ఏదైనా ఘర్షణకు ప్రతిస్పందించడానికి సూపర్ సన్నద్ధంగా ఉందని చెప్పారు.
మదురో అరెస్టుపై అమెరికా 50 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. దీంతో ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కరేబియన్ దీవులు చాలా కాలంగా అమెరికా భద్రతా దళాలు-మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారింది. అమెరికా కోస్ట్ గార్డ్-చట్ట అమలు సంస్థలు.. రెండూ గతంలో వెనిజులా-పొరుగు దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్మగ్లర్లతో సముద్రంలో ఘోరమైన ఘర్షణలకు పాల్పడ్డాయి.
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!