UN Warns: 48 గంటల్లో గాజాలో 14 వేల మంది పిల్లలు చనిపోవచ్చు.. యూఎన్ హెచ్చరిక
- 48 గంటల్లో గాజాలో 14 వేల మంది పిల్లలు చనిపోవచ్చు
- ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా పరిస్థితి దయనీయంగా మారింది. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా మానవతా సాయం నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లభించక విలవిలలాడిపోతున్నారు. దీంతో యూఎన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఆహారం అందకపోతే వేలల్లో పిల్లలు చనిపోతారని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మావోల హతం.. మృతుల్లో అగ్రనేత!
Also Read
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ నాశనం చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. ప్రజలకు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇక చిన్న పిల్లల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. పోషకాహార లోపంతో పిల్లలు కృషించి పోతున్నారు. యుద్ధం కారణంగా స్వచ్చంధ సంస్థలు అందించే ఆహారం నిలిచిపోవడంతో గాజాలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సరైన వైద్యం అందక కూడా నీరసించి పోయారు. దీంతో తాజాగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం ఐదు ట్రక్కుల ఆహారం మాత్రమే గాజాలోకి ప్రవేశించాయని యూఎన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయడమే
గాజాలో దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆహారం పంపిణీకి అనుమతి ఇచ్చారు. అయితే కొద్ది ఆహారమే చేరడంతో మరింత మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లో ఆహారం చేరకపోతే 14 వేల మంది చనిపోవచ్చని యూఎన్ హెచ్చరించింది. దాదాపు 11 వారాల పాటు గాజాను ఇజ్రాయెల్ పూర్తి దిగ్బంధించింది. దీంతో పాలస్తీనియన్లకు ఆహారం లభించలేదు. అయితే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే వంటి మిత్ర దేశాల ఒత్తిడితో ఆదివారం స్వల్పంగా నెతన్యాహు అనుమతి ఇచ్చారు. మిత్ర దేశాలు తీవ్రంగా విమర్శించడంతో నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఓ వైపు నెతన్యాహు స్వల్ప అనుమతి ఇచ్చినా.. ఇంకోవైపు భీకరమైన దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ వారంలో జరిగిన దాడుల్లో వందల కొద్ది పాలస్తీనియర్లు చనిపోయారు. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే నెతన్యాహు ప్రకటించారు. ఆ దిశగానే ఐడీఎఫ్ సాగుతోంది.
తాజావార్తలు
-
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!