Emine Dzhaparova: భారత్ను సందర్శించనున్న ఉక్రెయిన్ మంత్రి.. యుద్ధం తర్వాత తొలి అధికారిక పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Minister Emine Dzhaparova To Visit India On Monday: ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. సోమవారం భారత్లో అడుగుపెట్టనున్న ఆమె.. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులు, గ్గోబల్ సమస్యల గురించి చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్కి ఇది మొదటి అధికారిక పర్యటన. తన ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా ఝపరోవా కలవనున్నారు. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో.. విద్య, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ పర్యటన.. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునే సందర్భంగా నిలవనుంది’’ అంటూ ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
భారత ప్రభుత్వంతో చర్చల సందర్భంగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రతిపాదించిన 10 పీస్ ఫార్ములాను మంత్రి రూపరోవా ప్రస్తావించనున్నారని, దీన్ని గ్లోబల్ వాయిస్గా మార్చడంలో భారత్ మద్దతును కోరనున్నారని తెలిసింది. అలాగే.. ఆమె ప్రధాని మోడీని కైవ్కు ఆహ్వానించే అవకాశం ఉంది. జీ20 సమ్మిట్లో ఆహ్వానం పొందెందుకు కూడా ఉక్రెయిన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా.. కాగా.. ఈ ఏడాది జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్, ఉక్రెయిన్పై దాడి చేసినందుకు మిత్రదేశమైన రష్యాను నిందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే.. రష్యన్ చమురు కొనుగోళ్లను పెంచుతూ, దౌత్యపరమైన పరిష్కారాన్నీ కోరింది. ప్రధాని మోడీ సైతం ఇరు దేశాల అధ్యక్షులతో ఇప్పటికే చాలాసార్లు ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. మరోవైపు.. యుద్ధంలో దెబ్బతిన్న విద్యుత్ మౌలిక సదుపాయాలను సరిచేయడానికి ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధన పరికరాలతో సహా మరిన్ని మానవతా సహాయం కోసం భారతదేశాన్ని ఉక్రెయిన్ అభ్యర్థించింది.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!