Site icon NTV Telugu

Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26 వేల మంది మిస్సింగ్..

Ukraine War

Ukraine War

Russia-Ukraine War: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నా.. వెస్ట్రన్ దేశాల ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయంతో రష్యాకు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది.

Read Also: The Vaccine War: “ది వాక్సిన్ వార్” సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు..

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26,000 మంది ఆచూకీ తెలియడం లేదని ఉక్రెయిన్ గురువారం వెల్లడించింది. అధికారికంగా తప్పిపోయిన వ్యక్తుల్ని అంచనా వేయడం కష్టంగా మారింది, ఎందుకంటే రష్యా 5 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించిందని, ఏ దేశం కూడా సైనిక మరణాల గురించి డేటాను విడుదల చేయడం లేదు. ప్రస్తుతం 26 వేల మంది ప్రజలు మిస్సయ్యారని, వీరిలో 11,000 మంది పౌరులు ఉంటే, 15,000 మంది సైనిక సిబ్బంది ఉన్నారని డిప్యూటీ ఇంటర్నల్ మినిస్టర్ లియోనిడ్ టిమ్చెంకో తెలిపారు.

రష్యా ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంది. జపొరిజ్జియా, లూహాన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాలను తన గుప్పిట పెట్టుకుంది. ఈ నాలుగు ప్రాంతాలను తనలో కలుపుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలపై రష్యా దాడులు చేయడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ పోరాడుతోంది.

Exit mobile version