యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే యూకేకు ప్రధాని పీఠం రిషి సునక్ ను వరించే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
యూకేలో జరిగిన రాజకీయ సంక్షోభంలో ముందుగా రాజీనామా చేసిన వ్యక్తుల్లో ఛాన్సలర్ గా ఉన్న రిషి సునక్ ఒకరు. ఆయన రాజీనామా తర్వాతే ఒక్కక్కరిగా కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 లోపు బోరిస్ జాన్సన్ వారసున్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు.
Read Also: Godavari River: గోదావరి మహోగ్ర రూపం.. కాటన్ బ్యారేజ్ వద్ద పరిస్థితి ఇది..!
ఇదిలా ఉంటే ప్రధాని రేసులో రిషి సునక్ దూసుకుపోతున్నారు. తాజాగా ప్రధాని పదవి కోసం జరిగిన తొలి రౌండ్లో సత్తా కనబరిచారు. అందరి కన్నా ఎక్కువగా ఎంపీల ఓట్లు సాధించారు. రిషి సునక్ కు మొత్తం 88 ఓట్లు సాధించగా.. పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లు, ట్రస్ లిజ్ 50 ఓట్లు సాధించారు. మొత్తం ఎనిమిది మందిలో ప్రస్తుతం ఆరుగులు రెండో రౌండ్ లోకి వెళ్లనున్నారు. రిషి సునక్ తో పాటు సుయెల్లా బ్రేవర్మన్ కూడా రెండో రౌండ్ కు అర్హత సాధించారు. ఆర్థిక మంత్రి నదీమ్ జహావి, మాజీ క్యాబినెట్ మంత్రి జెరెమీ హంట్ పోటీ నుంచి తొలగించబడ్డారు.