UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
- గల్ఫ్ దేశాల్లో డ్రోన్ల కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE Drone Attack: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ (FOIZ)పై జరిగిన డ్రోన్ దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులు గాయపడటం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, హింసను తక్షణమే ఆపాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ విజ్ఞప్తి చేసింది.
ముగ్గురు భారతీయులకు గాయాలు..
సోమవారం ఫుజైరా చమురు పరిశ్రమ ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తోంది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మొత్తం నాలుగు క్షిపణులను ప్రయోగించింది. వీటిలో మూడింటిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగా, ఒకటి సముద్రంలో పడిపోయింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే పాటించాలని అధికారులు సూచించారు.
Also Read
భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన..
పౌర మౌలిక సదుపాయాలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలంటే సంక్షోభాలను కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ పునరుద్ఘాటించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నిరాటంకంగా నౌకాయానం సాగాలని, సముద్ర భద్రత విషయంలో అంతర్జాతీయ దేశాలు సమన్వయంతో వ్యవహరించాలని కోరింది. ప్రాంతీయ శాంతిని కాపాడటానికి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దాడి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాడుల వెనుక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
Our statement on the attack on Fujairah ⬇️
🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ
— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!