Jerusalem Blasts: జంట పేలుళ్లతో వణికిన ఇజ్రాయిల్.. జెరూసలేంపై మిలిటెంట్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twin blasts at bus stops shake Jerusalem, over 15 injured: ఇజ్రాయిల్ జంట పేలుళ్లతో వణికింది. జెరూసలేంలోని బస్ స్టాపులే టార్గెట్గా వరసగా రెండు పేలుళ్లు జరిగాాయి. నగరం శివారులో ఉన్న బస్ స్టాండ్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో 15 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. పాలస్తీనా మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అత్యవసర సేవలను మోహరించారు. సిటీ వెస్ట్రన్ ఎగ్జిట్ సమీపంలోని బస్ స్టేషన్ లో మొదటి పేలుడు సంభవించగా.. రెండవది నగరానికి తూర్పున ఉన్న బస్ స్టేషన్ లో జరిగింది. దాదాపుగా 30 నిమిషాల వ్యవధిలో ఈ రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
Read Also: Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..
Also Read
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
వెస్ట్రన్ ఎగ్జిట్ వద్ద జరిగిన పేలుడులో మొత్తం 12 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒకరు మరణించారు. మరో చోట జరిగిన పేలుడులో బస్సు దెబ్బతింది, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సాక్ష్యాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. ఘటనపై రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ షిన్ బెట్, అంతర్గత భద్రతాధికారులతో సమావేశం అయ్యారు. వీటిని తీవ్రవాద దాడులుగా అక్కడి మంత్రులు అభివర్ణిస్తున్నారు.
ఇజ్రాయిల్, పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు తరుచుగా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నారు. దీంతో ఇజ్రాయిల్ ఆర్మీ గాజా స్ట్రీప్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేస్తోంది. 2000 నుంచి ఈ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం గాజా స్ట్రీప్ హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఉంది. తాజాగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రతినిధి బాంబు దాడులను ప్రశంసించారు. అయితే వీటికి మాత్రం బాధ్యత వహించలేదు. ఇక జెరూసలెం విషయానికి వస్తే ఇక్కడి టెంపుల్ మౌంట్ ప్రాంతంలో తరుచుగా యూదులు, ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు మళ్లీ గెలుపొందారు. ప్రస్తుతం ఈయన తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్న క్రమంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..