Site icon NTV Telugu

Trump: ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. శుభ పరిణామమేనా?

Trump1

Trump1

ఇజ్రాయెల్-లెబనాన్ గురించి అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 34 ఏళ్ల తర్వాత రెండు దేశాల నాయకులు సమావేశం కాబోతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత ఇరు దేశాల నాయకులు తొలి చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇజ్రాయెల్-లెబనాన్ నాయకులు గురువారం ఒక అరుదైన సమావేశంలో మాట్లాడనున్నారని, దశాబ్దాల తర్వాత ఇది తొలి సంభాషణ అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇరు దేశాల నాయకులు మాట్లాడుకుని దాదాపు 34 ఏళ్లు అయ్యింది. ఇది రేపు జరగనుంది. బాగుంది!.’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌ మీడియాలో రాశారు.

లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్‌తో అమెరికా చేసిన ఒప్పందంలో లెబనాన్ లేదంటూ ఇజ్రాయెల్ దాడులు చేసోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందంటూ ఇరాన్ వాదిస్తోంది. మొత్తానికి లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే ఇజ్రాయెల్‌తో చర్చల జరపొద్దంటూ హిజ్బుల్లా నాయకులు వాదిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version