థాయ్లాండ్-కంబోడియా మధ్య మరోసారి శాంతి ఒప్పందం జరిగింది. గత 20 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆయుధాలు వాడకంపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఇరు దేశాల రక్షణమంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది.
థాయ్లాండ్-కంబోడియా మధ్య చాలా రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. అయితే ట్రంప్ రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించి కాల్పుల విరమణ చేయించారు. రెండు దేశాల అధ్యక్షులు ట్రంప్ సమక్షంలో సంతకాలు కూడా చేశారు. కానీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఈనెల ప్రారంభంలో మరోసారి ఇరు దేశాలు దాడులకు దిగాయి. వైమానిక దాడులతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి 20 రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
