Sudan Crisis: సూడాన్ సంక్షోభం.. రంజాన్ సందర్భంగా మూడు రోజులు కాల్పుల విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan Crisis: సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశం సూడాన్ అట్టుడుకుతోంది. ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖార్టూమ్ నగరంలో రెండు దళాల పోరు తారాస్థాయికి చేరింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో 350 మందికి పైగా మరణించారు.
ఇదిలా ఉంటు ముస్లిం దేశం అయిన సుడాన్, రంజాన్ పండగ సందర్భంగా కాల్పుల 72 గంటల పాటు కాల్పుల విమరణ ప్రకటించినట్లు పారామిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈద్ ఉత్-ఫితర్ సందర్భంగా పౌరులను ఖాళీ చేయించేందుకు హ్యుమానిటీ కారిడార్ తెరవడానికి, కుటుంబాలను కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
Also Read
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
Read Also: Somu Veerraju: బీజేపీతో టీడీపీ కలుస్తుందా? అచ్చెన్నాయుడు ఏం చెబుతారు..?
ప్రజాస్వామ్య పునరుద్ధణ కోసం పారామిలిటరీని, సైన్యంలో కలిపే ప్రతిపాదనపై ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో సూడాన్ లో మరోసారి ప్రజాస్వామ్యం వైపు వెళ్లాలనే ఆశలను దెబ్బతీసింది. ఇటీవల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘర్షణను అణిచివేసేందుకు సైనిక పరిష్కారం తప్ప వేరే మార్గం లేదని ఆర్మీ చీఫ్ బుర్హాన్ అన్నారు.
ఈ ఘర్షణల కారణంగా సూడాన్ లోన ఖార్టూమ్ నగరంలో పాటు ఓమ్దుర్మాన్ మరియు బహ్రీలలో ప్రజలు పారిపోయేందుకు సిద్ధం అయ్యారు. వేలాది మంది సూటికేసులు పట్టుకుని బస్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. ఇక నగరంలో ఆస్పత్రుల్లో మందులు లేవు, సూపర్ మార్కెట్లలో సరుకులు లేవు. చాలా మంది విదేశీయులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపు 10,000 నుండి 20,000 మంది ప్రజలు చాద్లోని సరిహద్దులోని గ్రామాలలో ఆశ్రయం పొందారని యూఎన్ శరణార్థి సంస్థ UNHCR, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) తెలిపింది. దేశంలో నాలుగింట ఒక వంతు ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!