Sri Lanka: రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. పోలింగ్కి సర్వం సిద్ధం
- రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
- పోలింగ్కి సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో తొలిసారి బరిలో 38 మంది అభ్యర్థులు ఉన్నారు. రణిల్ విక్రమసింఘే, సాజిత్ ప్రేమదాస, అనుర కుమార దిస్సనాయకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితాలు మాత్రం ఆదివారం వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
- US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(75) ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా కోలుకోవడంతో నిపుణుల నుంచి ప్రశంసలు పొందారు. ప్రస్తుం త్రిముఖ ఎన్నికల పోరు నెలకొంది. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన పోటీదారులు ఎదురుదెబ్బలు చవిచూసినందున ఈ ఎన్నికలు గతంలో జరిగిన అన్ని అధ్యక్ష ఎన్నికల కంటే భిన్నమైనవి అని విశ్లేషకుడు కుసల్ పెరీరా తెలిపారు.
ఇది కూడా చదవండి: Pollution: షాకింగ్ న్యూస్.. కాలుష్యం వల్ల సంతాన లేమి సమస్య!
అనధికారిక ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఫ్రంట్ రన్నర్గా చెప్పబడుతున్న దిసానాయకే 2020 పార్లమెంట్ ఎన్నికలలో కేవలం మూడు శాతం ఓట్లను పోల్ చేయగా.. విక్రమసింఘే కేవలం 2 శాతం.. ప్రేమదాస 25 శాతం కంటే ఎక్కువ ఓట్లు మాత్రమే సాధించారు. 2022లో శ్రీలంక ఆర్థిక పతనంలో మునిగిపోవడంతో ప్రజా తిరుగుబాటు ద్వారా అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను దేశం విడిచి పారిపోయేలా చేసింది.
దాదాపు 17 మిలియన్ నమోదిత ఓటర్లు ఈ ఎన్నికల్లో 13,400 పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయడానికి అర్హులు. 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. పోల్ ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Himachal : మసీదులో నమాజ్ చేయాలంటే గుర్తింపు కార్డు చూపించాల్సిందే
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!