Sri Lanka: రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. పోలింగ్కి సర్వం సిద్ధం
- రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
- పోలింగ్కి సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో తొలిసారి బరిలో 38 మంది అభ్యర్థులు ఉన్నారు. రణిల్ విక్రమసింఘే, సాజిత్ ప్రేమదాస, అనుర కుమార దిస్సనాయకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితాలు మాత్రం ఆదివారం వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(75) ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా కోలుకోవడంతో నిపుణుల నుంచి ప్రశంసలు పొందారు. ప్రస్తుం త్రిముఖ ఎన్నికల పోరు నెలకొంది. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన పోటీదారులు ఎదురుదెబ్బలు చవిచూసినందున ఈ ఎన్నికలు గతంలో జరిగిన అన్ని అధ్యక్ష ఎన్నికల కంటే భిన్నమైనవి అని విశ్లేషకుడు కుసల్ పెరీరా తెలిపారు.
ఇది కూడా చదవండి: Pollution: షాకింగ్ న్యూస్.. కాలుష్యం వల్ల సంతాన లేమి సమస్య!
అనధికారిక ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఫ్రంట్ రన్నర్గా చెప్పబడుతున్న దిసానాయకే 2020 పార్లమెంట్ ఎన్నికలలో కేవలం మూడు శాతం ఓట్లను పోల్ చేయగా.. విక్రమసింఘే కేవలం 2 శాతం.. ప్రేమదాస 25 శాతం కంటే ఎక్కువ ఓట్లు మాత్రమే సాధించారు. 2022లో శ్రీలంక ఆర్థిక పతనంలో మునిగిపోవడంతో ప్రజా తిరుగుబాటు ద్వారా అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను దేశం విడిచి పారిపోయేలా చేసింది.
దాదాపు 17 మిలియన్ నమోదిత ఓటర్లు ఈ ఎన్నికల్లో 13,400 పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయడానికి అర్హులు. 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. పోల్ ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Himachal : మసీదులో నమాజ్ చేయాలంటే గుర్తింపు కార్డు చూపించాల్సిందే
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..