NTV Telugu Site icon

Bus Accident in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి

Bus Accident In Nepal

Bus Accident In Nepal

Bus Accident in Nepal: నేపాల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లో మినీబస్సు ప్రమాదానికి గురై ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఖాట్మండు నుండి బిర్‌గంజ్ వైపు వెళుతున్న బస్సు బగ్మతిలోని మకవాన్‌పూర్ జిల్లాలోని జురిఖెట్ వద్ద నిటారుగా ఉన్న మలుపు వద్ద బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. భీంఫేడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ మరొక మృతిచెందారని సీనియర్ పోలీసు అధికారి ప్రకటించారు.

అదేవిధంగా, మరో ప్రమాదంలో, పశ్చిమ నేపాల్‌లోని భూమే గ్రామీణ మునిసిపాలిటీకి చెందిన క్యాంగ్‌సి బగర్‌లో ప్రయాణీకుల బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. ఖాట్మండు నుండి రుకుమ్‌కోట్ వైపు వెళ్తున్న బస్సు (G1K 9109) ప్రమాదంలో పడటంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన ప్రయాణికుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులు రుకుంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.
Gold prices today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. బంగారం ధర ఎంతంటే?