Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు తుదివీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు ముగిశాయి. లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు, రాజులు, రాణులు పాల్గొన్నారు. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలికారు.
సోమవారం ఉదయం 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో రాణి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైనట్లైంది. వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్మినిస్టర్ అబే వరకూ రాణి శవపేటికను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి 12.15 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వెల్లింగ్టన్ అర్చి వరకు సాగింది. అక్కడి నుంచి విండ్సర్స్ క్యాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్కు రాణి శవపేటికను తీసుకెళ్లారు. ఈ అంతిమయాత్రలో కింగ్ ఛార్లెస్-3తోపాటు రాజ కుటుంబం పాల్గొంది. కింగ్ జార్జ్-6 మెమోరియల్ చాపెల్లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.
Also Read
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
Kashmir: 30 ఏళ్ళ తరువాత కశ్మీర్ థియేటర్లో వేసిన మొట్ట మొదటి సినిమా ఏదంటే..?
బ్రిటన్ రాణి అంతిమ సంస్కారాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది. అంతిమయాత్రను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా పౌరులు బ్రిటన్లోని లండన్ వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిని నియంత్రించేందుకు లండన్లో 36 కిలోమీటర్ల మేర బారికేడ్లు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ప్రాంతాల్లో రాణి అంత్యక్రియలను లైవ్ టెలికాస్ట్ చేశారు. బ్రిటన్లోని పార్కులలో భారీ తెరలు ఏర్పాటు చేసి అంత్యక్రియలను ప్రదర్శించారు. 1965లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అంత్యక్రియల తర్వాత భారీ స్థాయిలో జరిగిన కార్యక్రమం ఇదేనని సమాచారం. తండ్రి మరణానంతరం పాతికేళ్ల వయసులో బ్రిటన్ పగ్గాలు చేపట్టిన క్వీన్ ఎలిజబెత్-2.. 70 ఏళ్ల పాటు బ్రిటన్ను పాలించారు. అత్యంత సుదీర్ఘ కాలం బ్రిటన్ను పరిపాలించిన సామ్రాజ్ఞిగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 8న తన 96వ ఏట తుది శ్వాస విడిచారు.
https://www.youtube.com/watch?v=gT0J0_YUK64
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..