Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం!

  • ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య కుదిరిన సయోధ్య..
  • బందీలను విడుదల చేసేందుకు ఇరు వర్గాల ఒప్పందం..
  • బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం..
Isreal

Isreal

Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్‌- అమెరికా, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో బందీలను విడుదల చేసేందుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు చివరి దశకు వచ్చాయని ఇజ్రాయెల్‌ ప్రధాని మంత్రి కార్యాలయం తెలిపినట్లు.. అక్కడి మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను క్రమంగా తొలగించుకుంటున్ననట్లు పేర్కొన్నారు. అలాగే, ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశం తర్వాత ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు బెంజమిన్ నెతాన్యహు క్యాబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే.. వచ్చే ఆదివారం నాటి నుంచి ఇది అమలుల్లోకి వస్తుంది. కాగా, ఇరు దేశాల మధ్య బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం అవుతంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలను సైతం ఖరారు చేయనున్నట్లు టాక్. ఇక, ఈ ఒప్పందం గురించి ఇప్పటికే బందీల కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సమాచారం అందజేసింది.

Read Also: Hyderabad: అఫ్జ‌ల్‌గంజ్‌ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!

అయితే, 2023 అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ భారీగా దాడికి దిగింది. ఈ ఘటనలో సుమారు 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌ ప్రజలు మరణించగా.. మరో 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా తీసుకుపోయారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకరమైన దాడులకు దిగింది. హమాస్‌ అగ్రనేత ఇస్మాయెల్‌ హనియా, యహ్యా సిన్వార్‌తో పాటు కీలక నేతలను చంపేసింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో దాదాపు 46 వేల మందికి పైగానే పాలస్తీన ప్రజలు చనిపోయారు.