PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది

  • ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది
  • త్వరలో ‘గగన్‌యాన్’ మిషన్‌కు కూడా సిద్ధంగా ఉన్నాం
  • 6G టెక్నాలజీ కూడా రాబోతుందని వెల్లడి
Modi4

Modi4

గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ‘‘మన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరుకున్నాయి. మన ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరించుకున్నాయి.’’ అని తెలిపారు.

‘‘ఇప్పుడు భారతదేశం తన సొంత ‘గగన్‌యాన్’ మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి సిద్ధమవుతోందని.. అలాగే సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే లక్ష్యం దిశగా పనిచేస్తోంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మార్కెట్‌గా అవతరించింది. భారతదేశం ‘మేక్ ఇన్ ఇండియా’ 6G టెక్నాలజీపై వేగంగా పనిచేస్తోంది. గత 12 సంవత్సరాలలో భారతదేశవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా నగరాలకు మెట్రో నెట్‌వర్క్‌లు విస్తరించాయి. నేడు భారతదేశంలో ప్రతిరోజూ 12.5 మిలియన్లకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. మేము భారతదేశంలో నమో భారత్ రాపిడ్ రైల్, వందే భారత్ వంటి సెమీ-హై-స్పీడ్ నెట్‌వర్క్‌లను వేగంగా విస్తరిస్తున్నాం.’’ అని తెలిపారు.

‘‘భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూస్తోంది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో మీరు దాని ప్రదర్శనను చూసే ఉంటారు. ఉగ్రవాదుల స్థావరాలపై పేలుళ్లు జరిగాయి. కానీ వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన ఈ భారీ దాడి మీకు గర్వాన్ని కలిగించిందా లేదా?.’’ అని అన్నారు.