Site icon NTV Telugu

కుప్ప‌కూలిన విమానం.. ఒక్క‌రు కూడా మిగ‌ల‌లేదు..

త‌ర‌చూ విమాన ప్ర‌మాదాలు, హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. కీల‌క వ్య‌క్తుల‌ను కూడా కోల్పోయిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, పెరూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది… టూరిస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ద‌సేప‌టికే కుప్ప‌కూలిపోయింది.. ఈ ప్ర‌మాదంలో మొత్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటనకు టూరిస్టులను తీసుకెళ్తుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.. ఐదుగురు పర్యాటకులతో పాటు పైలట్, కో పైలట్ కూడా అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.. మృతిచెందిన ప‌ర్యాటకుల్లో ముగ్గురు నెదర్లాండ్, ఇద్దరు చిలీకి చెందినవారు ఉన్నార‌ని స్థానిక అధికారులు వెల్ల‌డించారు.. విమాన ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని.. విమానంలో ఉన్న అంద‌రూ క‌న్నుమూశార‌ని తెలిపారు.

Exit mobile version