Pakistan Violence: పాకిస్తాన్లో అల్లర్లు.. మునీర్, షెహబాజ్ అమెరికాకు తొత్తులు..
- పాకిస్థాన్లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు..
- పాలస్తీనాకు మద్దతుగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ సంస్థ పిలుపు..
- ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Violence: దాయాది పాకిస్థాన్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీతో పాక్ సర్కార్ అప్రమత్తమైంది. ఈరోజు ( అక్టోబర్ 10న) జరగనున్న ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా ఆపేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, రాజధానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను దిగ్బంధించారు. నగరంలో రెడ్ జోన్ను పూర్తిగా సీల్ చేసి, కేవలం అధికారిక పాసులు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పంజాబ్ ప్రావిన్స్ వ్యాప్తంగా 10 రోజుల పాటు 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది తిరగడటంపై నిషేధం విధించారు.
Read Also: Post Office Scheme: ఏడాదికి కేవలం రూ.755లకే ప్రీమియం.. రూ.15 లక్షల ప్రయోజనాలు
Also Read
అయితే, ఈ ర్యాలీకి ముందే లాహోర్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. టీఎల్పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బుధవారం రాత్రి వారి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో టీఎల్పీ కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లతో పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఈ సందర్భంగా తమ కార్యకర్త ఒకరు మరణించగా, 20 మందికి గాయాలు అయ్యాయని టీఎల్పీ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ప్రభుత్వ చర్యలను టీఎల్పీ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా తలపెట్టిన మా ర్యాలీని అడ్డుకోవడానికి సర్కార్ నీచమైన చర్యలకు దిగుతుందని ఆరోపించారు. పాలస్తీనాకు సపోర్టు తెలపడం పాకిస్థాన్లో నేరంగా మారిందన్నారు టీఎల్పీ ప్రతినిధి.
Read Also: Ap Fake Liquor Case : ఏపీ కల్తీ మద్యం కేసులో పెద్ద షాక్..! విదేశాల్లో మెయిన్ నిందితుడు..
ఇక, ఈ నిర్బంధాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని టీఎల్పీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం లాహోర్లోని టీఎల్పీ ప్రధాన ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపు తప్పితే పారామిలటరీ దళాలైన రేంజర్లను రంగంలోకి దించాలని పంజాబ్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ అమెరికాకు తొత్తులుగా మారి పాలస్తీనాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీఎల్పీ శ్రేణులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!